పాదముద్రలు
ఒక వ్యక్తి ఒకనాటి రాత్రి కలగన్నాడు. ఆ కలలో అతనూ మరియు భగవంతుడూ కలసి సముద్రం వడ్డున నడచివెళ్తున్నారు. అతని జీవితం లో జరిగిన అనేక సంఘటనలు ఆకాశం లో చలనచిత్ర ద్రుశ్యాల్లా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ద్రుశ్యానికీ రెండు జతల పాదముద్రలు ఇసుకలో పడుతూ ఉండటాన్ని అతను గమనించాడు. ఒకటి అతనిది, మరొకటి భగవంతునిది.
అతని జీవితం లో ఆఖరి ద్రుశ్యం అయిపోయేసరికి, వెనుతిరిగి ఒకసారి పాదముద్రలు చూసుకున్నాడు. అతను గమనించిందేమంటే అతని జీవితరహదారి లో చాలా సార్లు ఒక జత పాదముద్రలు మాత్రమే ఉన్నాయి. ఆఅశ్చర్యకరంగా అవి అతను కష్తాల్లోనూ, బాధాకరమైన సమయాల్లో ఉన్నప్పుడె ఉన్నాయి.
అతను కలవరపడి, వెంటనే భగవంతుడ్ని అడిగాడు. “స్వామీ! నువ్వు ఎప్పుడూ నావెంటే ఉంటానని వాగ్ధానం చేసావు. కాని, ఎప్పుదైతే నేను బాధల్లో ఉన్నానో ఆ సమయాల్లో కేవలం ఒక జత పాదముద్రలే ఉన్నాయి. నాకు అర్ధం కావటం లేదు స్వామీ! ఆ సమయాల్లో నువ్వు ఏమైపోయావు? అలాంటి సమయాల్లోనే కదా నాకు నీ తోడు అవసరం. మరి నన్నెలా వదిలేసావు స్వామీ?”
దేవుడు బదులిచ్చాడు. “నాయనా! నువ్వు నా ప్రియపుత్రుడివి, నీవంటే నాకు అపారమైన ప్రేమ. నేను నిన్ను ఏనాడూ వదల్లేదు. కష్తాల్లో ఉన్న సమయాల్లో, నువ్వు ఓకే జత పాదముద్రల్ని చూసావు. ఎందుకంటె ఆ సమయాల్లో నిన్ను నేను మోసుకెళ్ళాను కాబట్టి.”
-రచయిత ఎవరో తెలియదు.



వల్లూరి said,
August 5, 2007 at 10:49 PM
బాగుంది. ఆ అజ్ఞాత రచయత ఏవరోగాని మంచి సత్యాన్ని తెలిపారు.
…వల్లూరి
Anonymous said,
August 25, 2007 at 10:38 AM
chala bagundi