వ్యాసం కన్నా వ్యాఖ్య గొప్పది. “ఇ – తెలుగు” సమావేశం. ఓ సందేశం.
“ఈ కాంక్రీట్ జనారణ్యంలో కొన్ని పిచ్చి మొక్కలు, ఎవరికీ పనికి రావు. కొన్ని కలుపు మొక్కలు, ఇవి పరాన్న బుక్కులు. ఇంకా కొన్ని విషపు మొక్కలు. నమ్మకంగానే కనిపిస్తాయి. కాని నమ్మితే చంపుతాయి. అయితే చాలా, చాలా మొక్కలు మాత్రం ఆహారాన్నీ, ఆవాసల్నే కాక , తాము ఎండినా మనకు నీడనిస్తాయి. అవి తడిచినా మనల్ని తడవనివ్వవు, మరి కొన్ని చనిపోయి మనల్ని బ్రతికిస్తాయి. ఇది పకృ తి సహజమేమో? నిస్వార్ద “ఇ – సేవ” కి నమస్సుమాంజిలి.”
– నక్కా కృష్ణ
కొందరి వ్యక్తుల నిస్వార్ధ “ఇ – సేవ” గురించి ఈ బ్లాగులో ఈమధ్య ప్రచురించబడిన ఓ వ్యాసానికి వచ్చిన వ్యాఖ్య ఇది. వ్యాసం కన్నా ఇదే బాగుందనిపించింది . అందుకే మీ కందిస్తున్నాము. ఈరోజు ౦౬-౦౧-౨౦౦౮ (౦6-౦1-2008) ఆదివారం, మధ్యాహ్నం 3 గంటలకి, కష్ణకాంత్ పార్క్, యూసఫ గూడ, హైదరాబాద్ లో “ఇ – తెలుగు ” సమావేశం జరగనుంది. అందరూ ఆహ్వానితులే. ఈ “ఇ – తెలుగు” సమావేశాలు విజయవంతమవ్వాలని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాము.




తెలుగు అభిమాని said,
January 6, 2008 at 5:52 PM
వ్యాఖ్య బాగుంది. బాపు బొమ్మ ఇంకా బాగుంది.
నువ్వుశెట్టి బ్రదర్స్ said,
January 7, 2008 at 6:44 PM
అవును. తెలుగు తనానికి మారుపేరు కదా బాపు.