ప్రత్యేక హోదా దొంగల గురించి-శ్రీమాన్ చంద్రబాబుకో కంప్లైంటు
To:cm@ap.gov.in
నమస్కారం!
చాలా వ్యతిరేక శక్తులున్నా కూడా మీ పరిపాలన, ముందు చూపు చాలా బాగా ఉన్నాయి. ఇందుకు ఎంతో సంతోషంగా ఉంది ఇంకా మీ మీద నమ్మకం పెరుగుతూ ఉంది.
చాలా వ్యతిరేక శక్తులున్నా కూడా మీ పరిపాలన, ముందు చూపు చాలా బాగా ఉన్నాయి. ఇందుకు ఎంతో సంతోషంగా ఉంది ఇంకా మీ మీద నమ్మకం పెరుగుతూ ఉంది.
ప్రత్యేక హోదా గురించి నరేంద్ర మోడి గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానం మరియు వెంకయ్యనాయుడు గారు రాజ్యసభ లో పడిన తపన ప్రతి ఆంధృడికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వీటికి తోడు మీ పట్టుదల, అవినీతి లేని తనం, నమ్మకం, ముందుచూపు వల్ల మీ మీద భారం వేసి తెలుగుదేశాన్ని నెత్తిన పెట్టుకున్నాము. ఈ విషయం మీకు అందరికన్నా బాగా తెలుసు.
ప్రత్యేకంగా ఈ ఉత్తరం ఎందుకు వ్రాస్తున్నానంటే, పై విషయలే కాక మాకెప్పటికీ గుర్తుండిపోయే మరో విషయం ఏమిటంటే కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఎం.పి లు చేసిన దారుణమైన ద్రోహం. వాళ్ళందరున్నారులే మన రాష్ట్రానికి ఏమి పర్లేదు, అన్యాయం జరగదు అనే అందరం అనుకున్నాము. అమాయకంగా నమ్మేము. ఆ నమ్మక ద్రోహానికి ప్రతిఫలంగా కొత్త ఆంధ్రప్రదేశ్ అసెంబ్లి లో ఒక్క కాంగ్రెస్ అభ్యర్ధి కూడా లేకుండా చేసేము.
విభజన సమయంలో ఎప్పుడు ప్రజలు వాళ్ళని ప్రశ్నించినా, రిజైన్ చేసి మాట్లాడండి అంటే “మేము మంత్రి ప్రదవికి రాజీనామా ఇస్తే మన రాష్ట్రానికి న్యాయం ఎలా జరుగుతుంది?” అని తిరిగి ప్రశ్నించే వారు. మేము నిజమే అనుకున్నాము. ప్రత్యేకించి శ్రీమతి పురందరేశ్వరి.
ఇప్పుడు మీ కేంద్ర మంత్రి శ్రీ సుజనా చౌదరి గారు కూడా అదే తప్పు చేస్తున్నారు. అదే డైలాగ్ చెప్తున్నారు. ఆ డైలాగ్ తో మేమెంతో విసిగి వేసారి పోయి ఉన్నాము. అసహ్యం వేస్తోంది. అది చిన్నగా మీక్కూడా పాకుతుంది. కాబట్టి దయచేసి మీ మంత్రులకి, ఎం.పి లకి మీరు నచ్చ చెప్పండి. వాళ్ళు రిజైన్ ఇవ్వకపోయినా క్షమిస్తాం గాని ఈ డైలాగ్ చెప్తూ పబ్బం గడుపుకుంటే మాత్రం చివరికి ఉన్నది పోతుంది ఉంచుకున్నదీ పోతుంది కాంగ్రెస్ నాయకులకి జరిగినట్లు.
తెలుగు వాళ్ళు పార్లమెంట్లో తలవంచుకుని ఉండద్దని చెప్పండి. ప్రత్యేక హోదా రాకున్నా సరే ఇలాంటి ఎంగిలి డైలాగ్ లు ఇకపై వాడద్దని చెప్పంది , అసహ్యంగా ప్రవర్తించద్దని చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పు రిపీట్ అవుతుండటాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పండి దయచేసి.
ఇట్లు మీ అభిమాని
ప్రత్యేకంగా ఈ ఉత్తరం ఎందుకు వ్రాస్తున్నానంటే, పై విషయలే కాక మాకెప్పటికీ గుర్తుండిపోయే మరో విషయం ఏమిటంటే కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఎం.పి లు చేసిన దారుణమైన ద్రోహం. వాళ్ళందరున్నారులే మన రాష్ట్రానికి ఏమి పర్లేదు, అన్యాయం జరగదు అనే అందరం అనుకున్నాము. అమాయకంగా నమ్మేము. ఆ నమ్మక ద్రోహానికి ప్రతిఫలంగా కొత్త ఆంధ్రప్రదేశ్ అసెంబ్లి లో ఒక్క కాంగ్రెస్ అభ్యర్ధి కూడా లేకుండా చేసేము.
విభజన సమయంలో ఎప్పుడు ప్రజలు వాళ్ళని ప్రశ్నించినా, రిజైన్ చేసి మాట్లాడండి అంటే “మేము మంత్రి ప్రదవికి రాజీనామా ఇస్తే మన రాష్ట్రానికి న్యాయం ఎలా జరుగుతుంది?” అని తిరిగి ప్రశ్నించే వారు. మేము నిజమే అనుకున్నాము. ప్రత్యేకించి శ్రీమతి పురందరేశ్వరి.
ఇప్పుడు మీ కేంద్ర మంత్రి శ్రీ సుజనా చౌదరి గారు కూడా అదే తప్పు చేస్తున్నారు. అదే డైలాగ్ చెప్తున్నారు. ఆ డైలాగ్ తో మేమెంతో విసిగి వేసారి పోయి ఉన్నాము. అసహ్యం వేస్తోంది. అది చిన్నగా మీక్కూడా పాకుతుంది. కాబట్టి దయచేసి మీ మంత్రులకి, ఎం.పి లకి మీరు నచ్చ చెప్పండి. వాళ్ళు రిజైన్ ఇవ్వకపోయినా క్షమిస్తాం గాని ఈ డైలాగ్ చెప్తూ పబ్బం గడుపుకుంటే మాత్రం చివరికి ఉన్నది పోతుంది ఉంచుకున్నదీ పోతుంది కాంగ్రెస్ నాయకులకి జరిగినట్లు.
తెలుగు వాళ్ళు పార్లమెంట్లో తలవంచుకుని ఉండద్దని చెప్పండి. ప్రత్యేక హోదా రాకున్నా సరే ఇలాంటి ఎంగిలి డైలాగ్ లు ఇకపై వాడద్దని చెప్పంది , అసహ్యంగా ప్రవర్తించద్దని చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పు రిపీట్ అవుతుండటాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పండి దయచేసి.
ఇట్లు మీ అభిమాని
గిరిచంద్,
అహ్మదాబాద్,
అహ్మదాబాద్,
గుజరాత్.
No trackbacks yet.