“Groping in ‘Andhera’ Pradesh” in NDTV
Last week, when chief minister Konijeti Rosaiah was asked at a press conference if he was going to Delhi to discuss the situation in Andhra Pradesh, he replied with a honesty and candour, rarely found in politicians of today. “Individual party views are already being represented in New Delhi. It is very chilly there. So I can’t go.” The reply did amuse a few journos but the truth is no one is blind to the chill that has set in on the administration in Andhra….
ఈ పూర్తి వ్యాసాన్నీ అందులో జరుగుతున్న ఆసక్తికరమైన చర్చనూ చదవాలనుకుంటే ఈ క్రింది లంకె చూడండి.
NDTV – Groping in ‘Andhera’ Pradesh.
మన ఆధ్రులం దేశంలో ఇప్పటికే నవ్వులపాలయ్యాం. మన గురించి ఎవరేమైనా మాట్లాడుకునే అవకాశాన్ని చేజేతులా కల్పించాం. ఇలా ఇంకెంతకాలం జరుగుతుందో మరి. మనల్ని ఆంధ్రులు కాదు అంధులు అని అనలేకనేమో మనం అంధకారంలో ఉన్నామంటున్నారు.
అమ్మ…కోర్ కమిటీ…ఓ సూపర్ కంప్యూటర్.
అప్పటికే పీకేసుకున్నజుట్టువంక దిగులుగా చూస్తూ కూర్చున్న అమ్మను చూసి, అమ్మా ఏంటి అ పిచ్చిచూపులు ,ఆ జుట్టు పీక్కోవటాలు, నాకేమీ అర్ధం కాలా అంటూ అమాయకంగా అడిగాడు ఆ పుత్ర రత్నం. ఉబికి వస్తున్నఏడుపుని దిగమింగుకుంటూ “ఏం చెప్పేదిరా కడుపు చించుకుంటే కాళ్ళమీదపడుతుంది, అయినా ఇదంతా మీ మామయ్య వల్ల వచ్చింది, అర్దరాత్రి ప్రకటన చేసి తను చేతులు దులుపుకున్నాడు, ఇప్పుడది నా తలమీద కొచ్చింది.” అంటూ క్రిందపడి ఉన్న జుట్టు వంక మళ్ళీ దిగులుగా చూసింది. “అవునమ్మా నిజమే తప్పు జరిగింది కాని అసలు తప్పు ఎందుకు జరిగిందో తెలియడంలేదు అన్నాడు.” పుత్ర రత్నం ఏదో ఆలోచిస్తూ.”ఆ… అందరూ మద్దతు పలుకుతాం, మద్దతు పలుకుతాం అంటూ ఉంటే నిజమే అనుకుని పుట్టిన రోజు కానుకగా ఉంటుందని ఇచ్చేశాం. ఇప్పుడది చిరిగి చాటంత అయింది అంటూ నిట్టూర్చింది.” అమ్మ పరిస్తితి చూచి జాలి పడి ఒక్క క్షణం ఆలోచించి, “అమ్మా నువ్వేం బాధ పడకు, అధిష్టానానివి, నువ్వే ఇలా డీలా పడితే ఏలా? నా దగ్గర ఓ సూపర్ కంప్యూటర్ ఉంది దానికి డాటా అంతా ఫీడ్ చేస్తాను, అది ఏమన్నా పరిష్కారం చూపిస్తుందేమో చూద్దాం.” అన్నాడు ఒకింత ఉత్సాహంగా..
“అవునా అయితే అదేదో త్వరగా చూడు , ఈ సారి అర్ద రాత్రి కాకుండా ఉదయాన్నే ప్రకటిద్దాం, అని అంతలోనే వద్దు వద్దు, మన మిత్రపక్షాల సహకరించరు … రేపు ఉదయాన్నే కోర్ కమిటి ముందు మిత్రపక్షాల ముందు ఫీడ్ చెయ్, అప్పుడు అయితే ఎవరూ మనల్ని ఏమీ అనరు లేకపోతే మొట్టికాయలు వేస్తారు.” అంది తల తడుముకుంటూ.
తెల్లారింది, విషయం బయటకి పొక్కింది అంతా ఉత్కంఠ సూపర్ కంప్యూటర్ ఎవరినీ నొప్పించకుండా ఏమి పరిష్కారం చూపుతుందో అని..మీడియా సూపర్ కంప్యూటర్ని లైవ్ లో చూపించసాగింది. దాని ఎదురుగా చకచకా వంద సంవత్సరాల చరిత్రను ఫీడ్ చేస్తున్న యువ నాయకుడు. కోర్ కమిటి లోని వృద్ద నాయకులంతా ముచ్చటగా చూడ సాగారు తమ భావి నాయకుడి వంక. తను చేస్తున్న పని పూర్తిచేసి అందరి వంకా చూశాడు తన చెరగని చిరునవ్వుతో. ఆందోళన పడవద్దు అని తల్లికి కళ్ళతోనే చెప్పి . . “ఆన్సర్ టు తెలంగాణా ఇష్యూ” అన్న బటన్ సున్నితంగా నొక్కాడు. బయటా,లోపలా అందరిలో ఉత్కంఠ, అంతా నిశ్శబ్దం.
ఆ నిశ్శబ్దాన్ని పారదోలుతూ సూపర్ కంప్యూటర్ లో మొదలైన శబ్దాలు ప్రాసెస్ జరుగుతున్నట్లుగా…. కొద్ది సెకన్ల తరువాత మానిటర్ మీద ప్రత్యక్షం అయ్యాయి అందమైన అక్షరాలు ముత్యాల్లా “ముందు తెలంగాణా ఇచ్చివేయండి, హైదరా బాద్ తో సహా….” అని.
దాన్ని లైవ్ లో చూచిన తెలంగాణాలో మిన్నంటిన కేరింతలు, రాయలసీమ,కోస్తా ఆంద్రాలలో, ఆగ్రహావేశాలు, హా హా కారాలు.
తలలు పట్టుకున్నారు కోర్ టీం సభ్యులు పరిస్తితి మళ్ళీ మొదటికి వచ్చిందని. అంతా నిరాశతో కూడిన నిశ్శబ్దం తల్లి కొడుకులతో సహా.
ఆ నిశ్శబ్దాన్ని పారదోలుతూ సూపర్ కంప్యూటర్ లో మళ్ళీ శబ్దాలు మొదలయ్యాయి.
మళ్ళీ అందరిలో ఉత్కంట ఈసారి ఏమొస్తుందా!!??? అని ఏమి జరుగుతుందా అని.
కొద్ది సెకన్ల తరువాత మానిటర్ మీద ప్రత్యక్షం అయ్యాయి అందమైన అక్షరాలు ముత్యాల సరాల్లా తెలుగు తల్లి మూడు పాయల జడ గంటల్లా “….తరువాత రాయలసీమ,కోస్తా ఆంద్రాలని పోరాటాల గడ్డ తెలంగాణాలోకలిపివేయండి “. ఇక రాష్ట్రం మొత్తం తెలంగాణే, ….నో రాయలసీమ,నో కోస్తా, నో ఆంధ్ర.అంతా తెలంగాణా రాష్ట్రమే. జై తెలంగాణా. కోర్ కమిటీ హా హా కారాలలొ బయటకి ఏమీ వినిపించలేదు.
జై సమైఖ్యాంధ్రా, జై తెలుగుతల్లి.
అర్ధరాత్రి స్వతంత్ర్యం…
నిజంగా అంధకారబంధురమే. ఆ సోనియా మహాతల్లి తానొక విక్టోరియా మహారాణి లా ఫీలయిపోయి అర్ధరాత్రి స్వతంత్ర్యం ప్రకటించేసింది. తెల్లతోలు కదా డివైడ్ అండ్ రూల్ బుద్ధి పోనిచ్చుకుందిగాదు. ట్వంటీ ట్వంటీ స్కోర్ లాగా రాజీనామాల లిస్టు పెరిగిపోతుండటంతో గాబోలు పార్లమెంటులో మాత్రం మొహంలో నెత్తుటి చుక్క లేకుండా బిక్కమొహమేసుకుని కనిపించింది. ఆ ఓ.యు యూనివెర్సిటీ విద్యార్ధులు చేసిన గొడవలు, జరిగిన హింసకు, ఎసి గదిలో సెలైన్లు తాగుతూ కె.సి.ఆర్ చేసిన త్యాగానికి ఇంతకన్నా ప్రతిఫలమేముంటుందని రోశయ్య గారి అధిష్టానం భావించి ఆంధ్ర ప్రదేశ్ ని చీకటి దెబ్బ కొట్టింది. ఓ రాష్ట్రన్ని సాధించడం ఇంత సింపులా అని దేశానికంతటికీ ఓ మంచి మెసేజినిచ్చారు ఈ క్వీన్ విక్టోరియా. ఏ ప్రాంతం ఎంతగా అభివృద్ధి చెందిందో ఎవరొచ్చి చూశారు? ఆంధ్రలో మా వూరికి కరంటు వచ్చి రెండేళ్ళు మాత్రమే అయింది. మొన్నటిదాకా తెలంగాణాలోకి బస్సులు నడపాలంటే భయపడిన వాళ్ళు, ఇప్పుడు తెలంగాణా దాటి నడపాలంటే వణుకుతున్నారు. ఇక్కడ నన్ను అందరూ అడుగుతున్నారు, నువ్వు ఆంధ్రలోకి పోతావా? లేక తెలంగాణాలోకా? ఒకవేళ ఆంధ్ర లోకెళితే మీ రాజధాని ఏమవుతుంది? అని. అవును ఏమవుతుంది? ఒకవేళ కర్నూలుని రాజధానిగా చేస్తే ఆంధ్ర వాళ్ళంతా మళ్ళీ తమ పెట్టుబడులన్నీ తీసుకెళ్ళి కర్నూల్లో పెడతారు. మరో కొన్నాళ్ళ తరువాత ఏ గొట్టం గాడొ సెలైన్లు తాగి, విద్యార్ధులను ప్రేరేపించి మా రాష్ట్రం మాగ్గావాలి అని చెప్పి కర్నూల్ని లాక్కెళ్ళిపోతారు. లేదా ఒకవేళ ఏ విజయవాడో, విశాఖనో కాపిటల్ చేస్తే రాయలసీమోళ్ళంతా అక్కడ పెట్టుబడులు గుమ్మరించి తరవాత ఆంధ్ర సపరేటయిపోతే వాళ్ళ తిరపతికెళ్ళి గుండు గీకిచ్చుకోవాలి.
చావుదప్పి కన్నులొట్టపోయిన చందాన పార్లమెంటు సీటు గెలిచిని చిదంబరం ఢిల్లీ లో చేసిన ప్రకటన, కందహార్ హైజాక్ ఉదంతాన్ని గుర్తుకు తెస్తూ గుండె మండిస్తూంది. అందుకే ఏమీ చేయలేక మా ఆఫీసులో ఉన్న ఓ అయిదుగురి తెలుగోళ్ళమి నల్ల బ్యాడ్జీలు తగిలించుకోని గుజరాతోళ్ళకి మా నిరసన తెలిజేస్తున్నామీరోజు.
లింకు “తల్లీ భిక్షాందేహి…”




